దేశంలో కరోనా మహమ్మారి విజృంభ‌‌ణ.. వారం రోజుల్లో 4.5లక్షలకుపైగా కొత్త కేసులు

మహమ్మారి శర వేగంగా విస్త‌రిస్తోంది. గడ‌చిన‌ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 4.5 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 6,666 మంది క‌రోనాతో మృతిచెందారు. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం గడ‌చిన‌ 7 రోజుల్లో దేశంలో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. అయితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ప్రపంచంలోని ఇత‌ర‌ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం ఆదివారం కొత్తగా 62,042 కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చితే ఆదివారం తక్కువ సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. గత 24 గంటల్లో మరో 856 మంది మృతి చెందారు. దేశంలో కోవిడ్ మరణాలు 900లోపు నమోదుకావడం ఆగస్టు 11 తర్వాత ఇదే తొలిసారి. కాగా దేశంలో కోవిడ్ రికవరీ రేటు 75 శాతానికి పెరిగింది. దేశంలో ప్రతిరోజూ 50 వేలకుపైగా బాధితులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 56, 863 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా కేసులు గతవారం ఎక్కువగా నమోదయినా.. వృద్ధిరేటు మాత్రం తగ్గడం కొంత సానుకూలంశం. అంతకు ముందు వారంతో పోలిస్తే గతవారం కొత్త కేసులు వృద్ధిరేటు 4.7 శాతం, మరణాలు 1.7 శాతం పెరిగాయి. ఆగస్టు 10-16 మధ్య ఇది 5.9 శాతం, మృతుల 4.4 శాతంగా ఉంది. అయితే, ఆగస్టు 3-9 మధ్య కోవిడ్ కేసుల వృద్ధిరేటు ఏకంగా 10.9 శాతం ఉండగా.. మరణాల రేటు 17.5 శాతం పెరిగింది. ఇక, ముందువారంతో పోల్చితే గతవారం 31,518 యాక్టివ్ కేసులు సోమవారం ఉదయం నాటికి దేశంలో కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,36,566కు పెరిగింది. దీంతో రికవరీ రేటు 75 శాతానికి చేరింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 57,692 దాటింది. ప్రస్తుతం దేశంలో 7.10 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్య 1.86 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యంత కనిష్టంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ నుంచి కోలుకునేవారి సంఖ్య నిలకడగా పెరుగుతుండటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య కేవలం 23.24 శాతానికి పరిమితమైందని వివరించింది.


from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2QjGa3o

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star