దయచేసి స్టేజ్-3కి వెళ్లొద్దు: మీరు సేఫ్‌గా ఉంటే రాష్ట్రం కూడా: మంత్రి ఈటెల ఆవేదన

హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజులపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని తేల్చి చెప్పారు. కుటుంబసభ్యులు కూడా వాళ్లను బయటికి రానీవద్దని, స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిదన్నారు. అలాంటివారు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xh8TQ3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments