వినేశ్ పొగట్‌కి కరోనా పాజిటివ్.. ఈరోజు ఖేల్‌రత్న‌ అందుకోవాల్సిన రెజ్లర్

భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్ వినేశ్ పొగట్‌కి కరోనా వైరస్ సోకింది. ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వినేశ్ పొగట్‌.. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌‌రత్న అవార్డుకి ఎంపికైంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శనివారమే ఆ ఖేల్‌రత్న అవార్డుని అందుకోవాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండనుందని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) తెలిపింది. అర్జున అవార్డుకి ఎంపికైన తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌కి కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దాంతో.. ఇద్దరూ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు. 2021లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన ఏకైక మహిళా రెజ్లర్‌గా నిలిచిన వినేశ్ పొగట్ ప్రస్తుతం హర్యానాలోని సోనెపట్‌లో శిక్షణ తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్పోర్ట్స్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తొలిసారి వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ.. అవార్డుల్ని అథ్లెట్స్ సమీపంలోని సాయ్ కేంద్రాలకి పంపింది. దాంతో.. ఈరోజు సాయ్ కేంద్రాలకి వచ్చి రాష్ట్రపతి పేర్లు పిలిచిన సమయంలో వచ్చి అథ్లెట్స్ వాటిని అందుకోవాలని అధికారులు సూచించారు. అయితే.. సాయ్‌కి వచ్చే ముందు అథ్లెట్స్‌కి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. వినేశ్ పొగట్, సాత్విక్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో అథ్లెట్ కూడా వైరస్ బారినపడ్డారని వార్తలు వస్తున్నాయి. కానీ.. ఆ అథ్లెట్ ఎవరనేది మాత్రం సాయ్ గోప్యంగా ఉంచుతోంది. ‘‘అవును.. నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అవార్డు ప్రదానోత్సవానికి ముందు నా శాంపిల్స్‌ని సోనెపట్‌లో సేకరించారు. అందులో పాజిటివ్‌గా వచ్చింది. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. నాలో ఇప్పటికీ ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు’’ అని వినేశ్ పొగట్ తెలిపింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3lBhrGn
via

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star