శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్.. లేటెస్ట్ రేట్లు ఇలా!
పసిడి పడిపోయింది. బంగారం వెలవెలబోయింది. నిన్న పెరిగిన ఈరోజు దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది తీపికబురు అని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే.. కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్లో పసిడి ధర దిగిరావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,800కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గింది. రూ.190 తగ్గుదలతో రూ.48,060కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.850 పడిపోయింది. రూ.47,600కు దిగొచ్చింది. Also Read: అలాగే హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,160కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.190 క్షీణతతో రూ.50,370కు తగ్గింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.850 పతనమైంది. దీంతో ధర రూ.47,600కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్కు 0.24 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్కు 1774 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్కు 0.02 శాతం పెరుగుదలతో 17.90 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2Yw5ZC6
via
Comments
Post a Comment