ఇంగ్లాండ్‌పై ఆఖరి టెస్టులో వెస్టిండీస్ టార్గెట్ 399.. ఇప్పుడు 10/2

వెస్టిండీస్‌తో సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టెస్టు విజయానికి ఇంగ్లాండ్ బాటలు వేసుకుంది. ఆటలో మూడో రోజైన ఆదివారం మరోసారి బ్యాటింగ్‌లో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు.. వెస్టిండీస్‌కి ఏకంగా 399 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆటలో ఇక రెండు రోజులు మిగిలి ఉండగా.. ఛేదనలో ఇప్పటికే 10/2తో కష్టాల్లో నిలిచిన కరీబియన్లు.. అద్భుతం జరిగితే తప్ప ఓటమిని నుంచి తప్పించుకోలేరు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమవగా.. పోటాపోటీగా జరుగుతుందనుకున్న చివరి టెస్టుని ఇంగ్లాండ్‌ ఏకపక్షంగా మార్చేసినట్లు కనిపిస్తోంది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం ఆరంభమైన ఈ మూడో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 369 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు పేలవ రీతిలో 197 పరుగులకే కుప్పకూలి.. 172 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఆతిథ్య జట్టుకి కట్టబెట్టింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ 226/2తో డిక్లేర్ చేసింది. మొత్తంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 172 పరుగుల్ని కలుపుకుని 399 లక్ష్యాన్ని వెస్టిండీస్‌కి ఇంగ్లాండ్‌ నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనని వెస్టిండీస్ పేలవంగా ఆరంభించింది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (0), కీమర్ (4) సింగిల్ డిజిట్‌కే వికెట్ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ (2 బ్యాటింగ్), షై హోప్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆటలో ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగా.. జోరుమీదున్న ఇంగ్లాండ్ బౌలర్లని ఎదుర్కోవడం వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌కి సవాలే.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2Bx2Yc6
via

Comments

Popular posts from this blog

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

South Korea Initiates Crackdown on Suspicious Crypto Activities