భారీగా పడిపోయిన వెండి.. భయపెడుతున్న బంగారం ధర!
పసిడి ప్రేమికులకు భారీ ఝలక్. దూసుకెళ్తోంది. మళ్లీ పరుగులు పెట్టింది. బంగారం ఈరోజు కూడా పైపైకి కదిలింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 పైకి కదిలింది. దీంతో ధర రూ.53,220కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.640 పెరుగుదలతో రూ.48,790కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. భారీగా దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.950 పతనమైంది. దీంతో ధర రూ.61,050కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.53 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్కు 1899 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.04 శాతం పెరుగుదలతో 23.99 డాలర్లకు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పైకి కదిలింది. రూ.49,550కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.550 పెరుగుదలతో రూ.50,750కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.950 తగ్గుదలతో రూ.61,050కు పడిపోయింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2ZVyjyG
via
Comments
Post a Comment