ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కోడలు మృతి కేసులో కొత్త ట్విస్ట్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనుమానాస్పద మృతి కేసు మరో కీలక మలుపు తిరిగింది. తన భార్య మరణంపైఅనుమానాలున్నాయని, తన అత్తామామలు కేసును తప్పుదోవ పట్టించి నిజాలు దాస్తున్నారని కన్నా కొడుకు ఫణీంద్ర ఆరోపిస్తున్నారు. ఆయన శుక్రవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. పలు కీలకమైన విషయాలను సీపీకి వివరించగా.. ఆయన కూడా అదే అంశాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. మొదట సిబీఐటీ దగ్గర చనిపోయిందని చెప్పారని.. తర్వాత ఏఐజీ హాస్పిటల్‌కి సమీపంలో ఉన్న బ్యాంబో హిల్స్ వద్ద చనిపోయిందని చెప్పారన్నారు. తన భార్య ఓ మారథాన్ రన్నర్ అని.. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవనన్నారు. కానీ ఆ రోజు ఏదో డ్రగ్స్ పార్టీ జరిగినట్టుగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. కుటుంబంలో తమకు తోడల్లుడుకి ఆర్థిక సమస్యలు ఉన్నాయని.. ఆయన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఆ రోజు సుహారికను అక్కడికి పిలిపించారని చెప్పుకొచ్చారు. ఇక సుహారిక చనిపోయిన రోజు ఏం జరిగిందని అత్తమామలను అడిగితే ‘నీకు అనవసరమా’ అంటూ వారు సమాధానమిచ్చారని ఫణీంద్ర అంటున్నారు. ఆరోజు పార్టీలో పాల్గొన్న నలుగురు కూడా తప్పించుకొని తిరుగుతున్నారని.. అసలు నిజాలు బయటకు రావట్లేదని పోలీసులు కేసుని దర్యాప్తు చేసి నిజాల్ని బయటికి తీసుకురావాలని ఫణీంద్ర కోరుతున్నారు. నల్లపురెడ్డి సుహారిక అనుమానాస్పద స్థితిలో మే 28న చనిపోయారు. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను రాయదుర్గంలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తేల్చారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3eXUkRM
via

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star