హైదరాబాద్లో వరద: ‘కేటీఆర్కు ట్వీట్ చేసినా పట్టించుకోట్లేదు’
హైదరాబాద్లో కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. నగరంలోని నాగోల్ డివిజన్ పరిధిలోని బృందావన కాలనీలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. రోజుల తరబడి వరద నీరు నిల్వ ఉండి రోడ్లపై మొత్తం నాచు ఏర్పడింది. దీంతో తాము జారి కిందపడి గాయపడుతున్నట్టు స్థానికులు చెప్పారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసినా సమస్య తీరడం లేదని వారు చెప్పారు. ఇప్పటివరకు నలుగురికి గాయాలు కాగా.. ఓ వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గత 20 రోజులుగా కాలనీల్లో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ అధికారి, నాయకుడూ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తమ కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2TP2tjn
via
Comments
Post a Comment