తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, వివాహానికి వెళ్లి వస్తుండగా!

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుల్ని రాజమండ్రి, గోకవరం ఆస్పత్రులకు తరలించారు.. వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులు మృతులు గోకవరం మండలం ఠాకుర్‌పాలెంకు చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/35Oa86S
via

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star