దేశంలో ఉద్ధృతంగా కరోనా.. నిన్న ఏకంగా 8వేలకుపైగా కొత్త కేసులు

దేశంలో విజృంభణ కొనసాగుతోంది. గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు రోజుల కిందట లక్షన్నర దాటగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 1.81 లక్షలకు చేరింది. కేవలం నాలుగు రోజుల్లోనే 30వేలకుపైగా కేసులు నమోదుకావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. శనివారం ఏకంగా 8,000 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. గడచిన 10 రోజులుగా రోజుకు సగటున 7వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక, దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 5,000 దాటింది. శనివారం మరో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 2,940 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. ఢిల్లీలో 1,163, తమిళనాడు 938, గుజరాత్ 412, పశ్చిమ్ బెంగాల్ 317, ఉత్తరప్రదేశ్ 262, మధ్యప్రదేశ్ 246, బిహార్ 208, హర్యానా 202, కర్ణాటక 141, అసోం 128 కేసులు నమోదయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా మరో 4,300 మంది కోలుకోగా.. మొత్తం కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 86,936కి చేరింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,168కి చేరగా.. ఒక్క ముంబయిలోనే 38,442 మందికి వైరస్ సోకింది. మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్‌లోనే ఉంది. అక్కడ మొత్తం 2,197 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇందులో ముంబయి నగరంలోనే అత్యధికంగా 1,227 మంది చనిపోయారు. గుజరాత్‌లో 1,000 మంది ఇప్పటి వరకూ కరోనాతో మృతిచెందారు. ఇది జాతీయ సగటు రేటు కంటే అధికం. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత గుజరాత్‌లోనే అత్యధికంగా 16,000 మందికిపైగా కరోనా బారినపడ్డారు. అంపన్ తుఫాను తర్వాత పశ్చిమ్ బెంగాల్‌లో కరోనా వైరస్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. పది రోజుల కిందట వరకు 1,500లోపు ఉన్న కరోనా బాధితులు.. ప్రస్తుతం అక్కడ 5,000 దాటారు. జమ్మూ కశ్మీర్‌లో 10 మంది గర్బిణిలు సహా 177 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఒడిశాలో శనివారం అత్యధికంగా 120 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,843కి చేరింది. ఏపీలో శనివారం ఒకే రోజు 131 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో వివిధ జిల్లాల్లో నమోదైనవి 70 కాగా, మిగిలిన 61 పొరుగు రాష్ట్రాలకు చెందినవి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 3,461కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 60. కేసులలో జిల్లాల్లోనివి 2,944, పొరుగు దేశాల నుంచి 111, ఇతర రాష్ట్రాల నుంచి 406 చొప్పున కేసులున్నాయి. తెలంగాణలో శనివారం మరో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కేసులు మొదలైన తరువాత ఇప్పటివరకు ఒక్క కేసు రాని వనపర్తి జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. రాష్ట్రానికి చెందిన 60 మందికి, ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 14 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మీడియా ప్రతినిధులకు కూడా కొవిడ్‌ సోకింది.


from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2Xg5NGD

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star