వ్యభిచారం చేసే బాలికతో రాసలీలలు.. నెల్లూరు జిల్లాలో ఎస్ఐ నిర్వాకం
అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పోలీసే విధి నిర్వహణను మరిచి ఇష్టారీతిగా వ్యవహరించిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా వ్యభిచారం కూపంలో చిక్కుకుపోయిన బాలికను రక్షించాల్సింది పోయి ఆమెతో ఏకాంత ప్రదేశంలో లైంగిక కోరికలు తీర్చుకున్న విషయం బయటకు రావడంతో నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. Also Read: వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నగరంలోని ఒక అపార్టుమెంటులో ఓ మహిళ కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఇటీవల ఆమె నిజామాబాద్కు చెందిన ఓ మైనర్ బాలికను అక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. జిల్లాలోని ఓ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐకి ఆ మహిళతో పరిచయం ఉంది. తన దగ్గర కొత్త అమ్మాయి వచ్చిందని ఆమె చెప్పడంతో ఎస్ఐలో కామకోరికలు చెలరేగాయి. ఆ బాలికను శుక్రవారం బయటకు తీసుకెళ్లి లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. అనంతరం ఆమెను వ్యభిచార గృహానికి వెళ్లిపోమంటూ తన కారులో పంపించాడు. Also Read: శుక్రవారం అర్ధరాత్రి నెల్లూరులో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఆ కారును పరిశీలించి ఆపారు. అందులో ఉన్న బాలికను విచారించగా ఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగింది వేరే పోలీస్స్టేషన్ పరిధిలోకావడంతో బాలికను విచారణ నిమిత్తం సంబంధిత పీఎస్ సీఐకి అప్పగించారు. పోలీసు శాఖ పరువుకు సంబంధించిన ఘటన కావడంతో ఉన్నతాధికారులు దీన్ని రహస్యంగా విచారిస్తున్నారు. ఎస్ఐ వివరాలను కూడా గోప్యంగా ఉంచారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న అపార్టుమెంటు వద్దకు వెళ్లిన పోలీసులు నిర్వాహకురాలిని విచారించినట్లు సమాచారం. Also Read:
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2XfJsJk
via
Comments
Post a Comment