అనంతపురం: నారా లోకేష్‌కు షాకిచ్చిన టీడీపీ మహిళా నేత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇటీవల వర్షాలకు నీట మునిగిన పంటల్ని పరిశీలించారు.. రైతులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే లోకేష్ పర్యటనకు ఓ మహిళా నేత మాత్రం దూరంగా ఉన్నారట. శింగనమల నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తనకు కాకుండా టీడీపీ నేత ఎంఎస్ రాజు వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారట. ఇరువర్గాల మధ్య కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. నారా లోకేష్‌ అనంతపురం పర్యటనకు బండారు శ్రావణి దూరంగా ఉన్నారు. పార్టీ నేతల పర్యటనపై తనకు సమాచారం ఇవ్వడంలేదని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే లోకేష్‌ పర్యటనకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్‌ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె గత రెండు వారాలుగా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. మరోవైపు లోకేష్ పర్యటనలో టీడీపీ నేతలు కూడా కొందరు అంటీముట్టనట్లు వ్యవహరించారు. కొందరు నేతలు ఎడమొహం పెడ మొహంగా ఉన్నారు.. కేవలం తమ, తమ నియోజకవర్గాల్లో పర్యటనకు మాత్రమే పరిమితం అయ్యారనే చర్చ జరుగుతోంది. మరి టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారాలపై ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. లోకేష్ పర్యటనకు దూరంగా ఉండటంపై బండారు శ్రావణీ శ్రీ స్పందించాల్సి ఉంది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/37BlFsP
via

Comments

Popular posts from this blog

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

South Korea Initiates Crackdown on Suspicious Crypto Activities