ఏపీ: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల పరిహారం

ఏపీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. కేసుల సంఖ్య తగ్గింది.. రికవరీ రేటు పెరిగింది. ఇటు ఆర్టీసీకి కరోనా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు 4,500 మంది సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారని అన్నారు. ఉద్యోగుల్లో 4,500 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. 72మంది మరణించారని తెలిపారు. ఉద్యోగుల అసోసియేషన్‌ ప్రతినిధుల అంగీకారం మేరకు ఒకరోజు బేసిక్‌ వేతనాన్ని కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున అందజేయనున్నట్టు చెప్పారు. ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి వారు విధులకు హాజరయ్యేలా ప్రోత్సహించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, రాష్ట్ర వ్యాప్త రీజనల్‌ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నిబంధనలను కేంద్రం సడలించడంతో అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్య పెంచడానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కృష్ణబాబు అన్నారు. ప్రస్తుతం 30-40శాతం బస్సులు మాత్రమే నడుపుతున్నాయని.. ఉద్యోగులను రొటేషన్‌ పద్ధతిలో వినియోగించుకోవాలని, కొందరిని డ్యూటీలకు వాడటం లేదనే ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. మరోవైపు బస్‌స్టేషన్లలో దుకాణదారులకు శుభవార్త చెప్పారు. మార్చి 22నుంచి జూన్‌ 7 వరకు బస్సులు నడపనందున చెల్లించవలసిన అద్దె బకాయిలు మాఫీ చేయాలని ఆదేశించారు. వారికి వాపసు చేయాల్సిన సెక్యూరిటీ డిపాజిట్‌ను వెంటనే చెల్లించాలన్నారు. . అక్టోబరులో రోజువారీ 30లక్షల కిలోమీటర్ల మేరకు కనీసం 60శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడపాలన్నారు. ప్రతీనెలా కనీసం రూ.250కోట్లు ఆదాయం ఆర్జించాలన్నారు. విధుల్లో ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబరులో వచ్చిన ఆదాయం డీజిల్‌ ఖర్చులకు సరిపోయిందని.. అక్టోబరు నుంచి బ్యాంకు లోన్లకు సంబంధించి బకాయిలు ప్రతీనెలా రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3jktW7u
via

Comments

Popular posts from this blog

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

South Korea Initiates Crackdown on Suspicious Crypto Activities