సెల్లార్లో వాన నీరు రోడ్డుపైకి.. భారీగా ఫైన్ వేసిన అధికారులు
భారీ వర్షాలకు ఇళ్లలోకి వాన నీరు వచ్చి చేరుతోంది.పలు ప్రాంతాలన్నీ జలయయం అవుతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి, అపార్టుమెంటుల్లోకి భారీగా వాన నీరు రావడంతో వారంతా పైపులు , మోటార్లు బిగించి సెల్లార్లోకి చేరిన నీరును బయట రోడ్లుమీదకు లేదంటే పక్కనే ఉన్న ఖాళీప్రదేశాల్లోకి, కుంట్లలోకి తోడేస్తున్నారు. అలా సెల్లార్లో చేరిన నీటిని రోడ్డుమీదకు వదిలిని ఓ యాజమాన్యాంకు భారీ జరిమానా విధించింది. సెల్లార్లోకి చేరిన నీటిని మోటార్తో సర్వీస్ రోడ్డుపైకి వదిలినందుకు వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ మేనేజ్మెంట్కు రూ. లక్ష జరిమానా విధించారు. Read More: నానక్రామ్గూడ ఓఆర్ఆర్ సర్వీ్సరోడ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ సమీపంలోని వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ మేనేజ్మెంట్లో వర్షం పడేటప్పుడల్లా భారీగా వాననీరు వచ్చి చేరుతోంది. దీంతో యజమానులు ప్రతిసారి నీటిని రోడ్డు మీదకు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులంతా ఆ ప్రదేశంలో జారిపడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి మేనేజ్మెంట్ను హెచ్చరించారు. అయినా మేనేజ్మెంట్ మాత్రం పద్ధతి మార్చుకోకుండా నీటిని రోడ్డు మీదకు వదులుతోంది. ఈ విషయాన్ని మంగళవారం జోనల్ కమిషనర్ రవికిరణ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన భారీగా జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ రవి పేర్కొన్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3kWIuus
via
Comments
Post a Comment