పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం.. బుద్ది తక్కువై నమ్మాం: నారాయణ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్, చంద్రబాబులపైనా మండిపడ్డారు.. ఈ ముగ్గురు తీరుతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్నారు. మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నారని సెటైర్లు పేల్చారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ని తాము నమ్మాము అన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమన్నారు నారాయణ. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్‌లో ఉందని.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడు ఎక్కువమంది ఎంపీలున్నా చేతులెత్తేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్‌కు పడుతుందన్నారు. జగన్, చంద్రబాబులు మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో తమ వైఖరి మారలేదన్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3i98kcU
via

Comments

Popular posts from this blog

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

South Korea Initiates Crackdown on Suspicious Crypto Activities