సుశాంత్తో డేటింగ్ చేశా.. రెగ్యులర్గా ఆ అలవాటు! నిజం ఒప్పుకున్న సారా అలీఖాన్.. సీక్రెట్స్ రివీల్
ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణ భాగంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ఇష్యూ తెరపై వచ్చి పలువురు హీరోయిన్ల మెడకు చుట్టుకుంది. సారా అలీ ఖాన్, దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్లను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా సారా అలీ ఖాన్ నిజం ఒప్పుకున్నట్లు బీటౌన్ మీడియా సమాచారం. మొదట రకుల్ ప్రీత్ సింగ్ని విచారించిన ఎన్సీబీ అధికారులు.. ఆ తర్వాత దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్ లను విచారించారు. ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, హీరోయిన్ సారా అలీ ఖాన్పై లోతుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆమె పలు కీలక విషయాలపై రియాక్ట్ అయ్యింది. సుశాంత్తో కొంత కాలం డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని ఒప్పుకున్న సారా.. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తెలిపింది. ఆయనతో కలిసి థాయ్లాండ్ పర్యటనకు కూడా వెళ్లానని తెలిపింది. అయితే తనకు రెగ్యులర్గా సిగరెట్ తాగే అలవాటు మాత్రానే ఉందని, డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని ఆమె తెలిపింది. Also Read: కేదార్నాథ్ సినిమాలో సుశాంత్, కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని కొద్దిరోజుల క్రితమే సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ పోలీసులకు చెప్పాడు. అయితే సుశాంత్, సారా బ్రేకప్కి కారణం రియా చక్రవర్తే అని ఆయన చెప్పడం మరిన్ని అనుమానాలు రేకెత్తించింది. మరోవైపు దీపికా పదుకొనే కూడా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు అబద్ధమని.. ఆరోగ్య రీత్యా అలాంటి వాటికి దూరంగా ఉంటానని ఆమె వివరణ ఇచ్చినట్లు సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కన్నీరు పెట్టుకుందట దీపికా. అయినప్పటికీ ఆమె నుంచి సమాచారం సేకరించిన ఎన్సీబీ అధికారులు సారా అలీ ఖాన్, దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. వారి వారి బ్యాంక్ స్టేట్మెంట్స్పై దృష్టి సారించారట ఎన్సీబీ ఆఫీసర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33bLDRa
Comments
Post a Comment