జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి కొత్త పార్టీ
తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్ఎం సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావుడి మొదలయ్యింది. ఎన్నికల అధికారులు మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలాని భావిస్తున్నారు. అయితే ఇప్పట్నుంచే అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రతీసారి ఎన్నికల్లో టీఆర్ఎస్తో పాటు మిత్రపక్షం ఎంఐఎం, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ చేస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి మరో పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. Read More: తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ (టీఆర్ఎల్డీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 90 శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎల్డీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2S8OROL
via
Comments
Post a Comment