బంగారం ధర జిగేల్.. 2 రోజులుగా పడిపోతూనే వస్తున్న వెండి!
జిగేల్మంది. పసిడి పరుగులు పెట్టింది. పైకి కదిలింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి పైకి కదలడం గమనార్హం. బంగారం ధర పెరిగితే.. మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.49,090కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.260 పైకి కదిలింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,550కు ఎగసింది. ఇకపోతే నిన్న పసిడి ధర స్థిరంగా కొనసాగిన విషయ తెలిసిందే. Also Read: పసిడి ధర పరుగులు పెడితే.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో ధర రూ.67,900కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెండి ధర పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. మరోవైపు విజయవాడ, విశాఖపట్నంలోనూ బంగారం, వెండి ధలు ఇలానే కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.50,050కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.290 పెరుగుదలతో రూ.54,600కు ఎగసింది. వెండి రూ.100 తగ్గుదలతో రూ.67,900కు క్షీణించింది. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్కు 0.07 శాతం తగ్గుదలతో 1953 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్కు 0.13 శాతం పెరుగుదలతో 27.12 డాలర్లకు చేరింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/35loxc5
via
Comments
Post a Comment