హైదరాబాద్వాసులకు గుడ్న్యూస్.. నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు, వివరాలివే
హైదరాబాద్వాసులకు శుభవార్త.. నేటి నుంచి ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు రోడ్డెక్కనున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో ఆగిపోయిన సిటీ సర్వీసులను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. దాదాపు ఆరు నెలలకు పైగా నిలిచిపోయిన సిటీ సర్వీసులను అన్ని రూట్లలో రేపటి నుంచి 25 శాతం నడుపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 బస్సుల్లో 25 శాతం బస్సులు రాకపోకలు సాగించనున్నాయని మంత్రి తెలిపారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని వైరస్ ప్రబలకుండా ఉండేందుకు మార్చి 22 నుంచి ఇప్పటి వరకు సిటీలో బస్సులను నడపలేదని.. అయితే సామాన్య ప్రజల రవాణా ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో హైదరాబాద్ రీజియన్లో సుమారు 1700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవి అన్నారు. ప్రస్తుతం నడిచే 25 శాతం బస్సుల్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఆపరేట్ చేసే విధంగా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఇప్పటికే సూచించారు. ఇటు కర్ణాటక, మహరాష్ట్రకు నడిపే సర్వీసులను కూడా పునరుద్దరిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2GccNxZ
via
Comments
Post a Comment