ఎంపీ రఘరామకృష్ణ రాజుకు షాకిచ్చిన వైసీపీ
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు వైఎస్సార్సీపీ షాకిచ్చింది. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారని సెక్యూరిటీ తొలగించాలని ఫిర్యాదు చేసింది. తనను అసభ్య పదజాలంతో దూషించారని రఘురామపై వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. కులం పేరుతో కించపరుస్తూ దుర్భాషలాడారని.. రఘరామకృష్ణం రాజు పదవిని, సెక్యూరిటీని అడ్డంపెట్టుకుని ఎస్సీ వర్గాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించాు. ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. గతంలోనే పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఇదివరకే రఘురామకృష్ణ రాజుపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణ రాజు వైఎస్సార్సీపీ ఎంపీల తీరుపై మండిపడ్డారు. తన తాట తీస్తామన్నారని.. తాట తీస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ మండిపడ్డారు. ఇటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై రఘురామకృష్ణ రాజు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సురేష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అసభ్య పదజాలంతో దూషించారని నోటీస్ ఇచ్చానన్నారు. ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో టేపును కూడా స్పీకర్కు అందజేశారు. తనపై అసభ్య పదజాలంతో, కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేశారని స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనికి కౌంటర్గా సురేష్ రఘురామపై ఫిర్యాదు చేశారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/366TXTR
via
Comments
Post a Comment