స్వల్ప భూకంపం.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. జనం పరుగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ప్రకంపనలు వచ్చాయి. అనేక గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tQs4Kli
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tQs4Kli
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment